'బావర్చి'పై కేసు కుళ్లి కంపుకొడుతున్న చికెన్తో బిర్యానీ సప్లై చేస్తున్నందుకు
- April 06, 2017
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు నగరంలోని హోటల్స్పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎల్.బి నగర్ లోని ది న్యూ గ్రీన్ బావర్చి హోటల్ ను అధికారులు తనిఖీ చేశారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని ఏమాత్రం దృష్టిలో ఉంచుకోకుండా కుళ్లి కంపు కొడుతున్న ఆహార పదార్థాలతో బిర్యానీ వండుతున్నట్లుగా గుర్తించారు.
పాడైపోయిన చికెన్, ఈగలు వాలిన ఆహారపదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యాన్ని దీనిపై నిలదీశారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, కనీస నిబంధనలను కూడా పట్టించుకోవడం లేదన్న కారణంగా రూ.10వేల జరిమానా విధించి హోటల్ పై కేసు నమోదు చేశారు.
కాగా, గత కొద్దిరోజులుగా హైదరాబాద్లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని హోటల్స్ పై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటల్స్ ను ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







