సాయిధర్మతేజ్, సందీప్ కిషన్, కృష్ణ వంశీల 'నక్షత్రం'
- April 07, 2017
తెలుగు తెరపై సామాజిక నేపద్యం ఉన్న క్రియేటివ్ దర్శకుడిగా... కృష్ణవంశీ కి మంచి పేరున్నది.. కానీ కృష్ణ వంశీ కలం పదును తగ్గిందో.. కధలో కొత్తదనం లోపించిందో .. గతకొంత కాలంగా ఫామ్ ని కోల్పోయాడు.. రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా ఆ అవకాశంను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.. కాగా కృష్ణ వంశీ నక్షత్రం అనే సినిమాను యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు.. సందీప్ కిషన్ పోలీస్ గా రూపొందుతున్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. నిడివి రెండున్నర గంటల వరకూ వచ్చిందట.. కధలో మరింత వేగం ఉండేలా.. రెండు గంటల నిడివి ఉండేలా సినిమాను కృష్ణ వంశీ ఎడిటింగ్ చేయిస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. దీంతో ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా చూస్తారని ఈ నిర్ణయం తీసుకొన్నారట.. ఈ రెండు గంటల సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సాయి ధరం తేజ్ 40 నిమిషాలు కనిపించనున్నాడట.. ప్రకాష్ రాజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, మానస్ లు నక్షత్రంలో మెరుస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







