1350 కిలోల ఆహారాన్ని ధ్వంసం చేసిన అల్ వక్రా మునిసిపాలిటీ
- April 07, 2017
మనషులు తినడానికి ఉపయోగపడని 1350 కిలోల ఆహార పదార్థాల్ని అల్ వక్రా మునిసిపాలిటీ ఇన్స్పెక్టర్స్ స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు. మొత్తం గత నెలలో 245 తనిఖీలు నిర్వహించారు అధికారులు. చట్ట పరిధిలోకి వచ్చే 12 ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. 12 ఉల్లంఘనల్లో 2 ఉల్లంఘనల్ని స్థానిక పోలీసులకు అల్ వక్రా మునిసిపాలిటీ అధికారులు రిఫర్ చేశారు. ఈ ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇంకో వైపున ఉల్లంఘనులతో 60 ప్రతిజ్ఞలు కూడా చేయించారు. ఇలాంటి తప్పిదాలు ఇంకోసారి జరగకుండా వారితో ప్రతిజ్ఞ చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. 10 షాపుల లైసెన్సుల్ని కూడా ఈ క్యాంపెయిన్లో తనిఖీలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









