1350 కిలోల ఆహారాన్ని ధ్వంసం చేసిన అల్ వక్రా మునిసిపాలిటీ
- April 07, 2017
మనషులు తినడానికి ఉపయోగపడని 1350 కిలోల ఆహార పదార్థాల్ని అల్ వక్రా మునిసిపాలిటీ ఇన్స్పెక్టర్స్ స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు. మొత్తం గత నెలలో 245 తనిఖీలు నిర్వహించారు అధికారులు. చట్ట పరిధిలోకి వచ్చే 12 ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. 12 ఉల్లంఘనల్లో 2 ఉల్లంఘనల్ని స్థానిక పోలీసులకు అల్ వక్రా మునిసిపాలిటీ అధికారులు రిఫర్ చేశారు. ఈ ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇంకో వైపున ఉల్లంఘనులతో 60 ప్రతిజ్ఞలు కూడా చేయించారు. ఇలాంటి తప్పిదాలు ఇంకోసారి జరగకుండా వారితో ప్రతిజ్ఞ చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. 10 షాపుల లైసెన్సుల్ని కూడా ఈ క్యాంపెయిన్లో తనిఖీలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







