రేపటి నుంచి భారతదేశం లో పెట్రోల్ బంకులు బంద్

- September 29, 2015 , by Maagulf
రేపటి నుంచి భారతదేశం లో పెట్రోల్ బంకులు బంద్

అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కార సాధనంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ పెట్రోలు బంకుల యజమానుల సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ బంద్‌కు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. దీనివల్ల రవాణా కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతుందన్నారు. లీటరు పెట్రోల్‌, డీజీల్‌పై పెంచిన రూ.4ల విలువ ఆధారిత పన్నును వెంటనే తగ్గించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com