క్షమాబిక్ష: ఎయిర్‌ ఇండియా 50 శాతం డిస్కౌంట్‌

- April 08, 2017 , by Maagulf
క్షమాబిక్ష: ఎయిర్‌ ఇండియా 50 శాతం డిస్కౌంట్‌

రియాద్‌: క్షమాభిక్ష కోసం నమోదు చేసుకున్నవారికి 50 శాతం డిస్కౌంట్‌తో కూడిన ప్రయాణ ధరల్ని ప్రకటించింది ఎయిర్‌ ఇండియా. ఎయిర్‌ ఇండియా సీనియర్‌ ఎజిఎం కుందన్‌ లాల్‌ కొత్వాల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. క్షమాభిక్ష సమయంలో ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని ఆయన వివరించారు. రియాద్‌, జెడ్డా, దమ్మమ్‌ నుంచి ఇండియాలోని పలు ప్రాంతాలకు సుమారుగా 500 సౌదీ రియాల్స్‌ (వీటికి ట్యాక్స్‌లు అదనం), రియాద్‌, జెడ్డా, దమ్మమ్‌ నుంచి ఢిల్లీకి 659 సౌది రియాల్స్‌, ఇతర డెస్టినేషన్స్‌కి 595 సౌదీ రియాల్స్‌ ధర నిర్ణయించారు. ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకునేవారికి 40 కిలోల చెక్‌డ్‌ ఇన్‌ బ్యాగేజీని రియాద్‌, మరియు జెడ్డాల నుంచి, అలాగే దమ్మమ్‌ నుంచి 30 కిలోల బ్యాగేజీని ప్రయాణీకులకు అనుమతిస్తారు. ఇండియన్‌ ఎంబసీ లేదా కాన్సులేట్‌ నుంచి ఇచ్చే ఎమర్జన్సీ సర్టిఫికెట్‌ని లేదా పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసే ఫైనల్‌ ఎగ్జిట్‌ వీసా చూపించి ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. హిందూస్తానీ బజ్మీ ఉర్దు ప్రెసిడెంట్‌ మాట్లాడుతూ ఎయిర్‌ ఇండియాకి అలాగే, కుందన్‌లాల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. పేదలు, మరియు బ్లూ క్లార్‌ ఉద్యోగుల కోసం ఈ తగ్గింపు ధరల విమానయానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com