రూ.800 తగ్గిన వెండి ధర
- April 08, 2017
వెండి ధర నేత చూపులు చూస్తోంది. శనివారం ఢిల్లీలో కిలో రజతం ధర 800 రూపాయలు తగ్గి 41,750 రూపాయల స్థాయికి చేరింది. కోల్కతా మార్కెట్లోనూ కిలో వెండి ధర 42,000 రూపాయల నుంచి 41,650 రూపాయలకు దిగొచ్చింది.
హైదరాబాద్ మార్కెట్లలోనూ కిలో వెండి ధర 42,600 రూపాయల నుంచి 41,900 రూపాయల స్థాయికి పడిపోయింది. . నాణేల తయారీదారులు, పారిశ్రామిక వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గడంతో వెండి ధర నేల చూపులు చూస్తోందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండికి పెద్దగా డిమాండ్ లేకపోవడం సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది.
స్థిరంగా పసిడి ధర
వెండి ధర తగ్గుతుంటే..
పసిడి ధర మాత్రం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర 29,300 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్లో శుక్రవారం 29,230 రూపాయలు ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం, శనివారం రూ.150 తగ్గి 29,080 రూపాయలకు చేరుకుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







