రూ.800 తగ్గిన వెండి ధర
- April 08, 2017
వెండి ధర నేత చూపులు చూస్తోంది. శనివారం ఢిల్లీలో కిలో రజతం ధర 800 రూపాయలు తగ్గి 41,750 రూపాయల స్థాయికి చేరింది. కోల్కతా మార్కెట్లోనూ కిలో వెండి ధర 42,000 రూపాయల నుంచి 41,650 రూపాయలకు దిగొచ్చింది.
హైదరాబాద్ మార్కెట్లలోనూ కిలో వెండి ధర 42,600 రూపాయల నుంచి 41,900 రూపాయల స్థాయికి పడిపోయింది. . నాణేల తయారీదారులు, పారిశ్రామిక వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గడంతో వెండి ధర నేల చూపులు చూస్తోందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండికి పెద్దగా డిమాండ్ లేకపోవడం సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది.
స్థిరంగా పసిడి ధర
వెండి ధర తగ్గుతుంటే..
పసిడి ధర మాత్రం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర 29,300 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్లో శుక్రవారం 29,230 రూపాయలు ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం, శనివారం రూ.150 తగ్గి 29,080 రూపాయలకు చేరుకుంది.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









