అల్లు శిరీష్ కొత్త సినిమా ప్రారంభం
- April 09, 2017
అల్లు శిరీష్ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. సురభి, సీరత్ కపూర్ కథానాయికలు. శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్ సన్నిధానంలో నిర్వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి షాట్కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ నెలాఖరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ థ్రిల్లర్ కథ ఇది. సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటుంది.
మంచి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. మలయాళంలో ‘1971’, ‘దృశ్యం’ చిత్రాలకు పనిచేసిన సుజిత్ వాసుదేవ్ దీనికి సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల్ని మెప్పించే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









