అల్లు శిరీష్ కొత్త సినిమా ప్రారంభం
- April 09, 2017
అల్లు శిరీష్ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. సురభి, సీరత్ కపూర్ కథానాయికలు. శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్ సన్నిధానంలో నిర్వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి షాట్కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ నెలాఖరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ థ్రిల్లర్ కథ ఇది. సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటుంది.
మంచి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. మలయాళంలో ‘1971’, ‘దృశ్యం’ చిత్రాలకు పనిచేసిన సుజిత్ వాసుదేవ్ దీనికి సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల్ని మెప్పించే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







