అల్లు శిరీష్‌ కొత్త సినిమా ప్రారంభం

- April 09, 2017 , by Maagulf
అల్లు శిరీష్‌ కొత్త సినిమా ప్రారంభం

అల్లు శిరీష్‌ కథానాయకుడిగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. సురభి, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. శ్రీనివాస్‌ అవసరాల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్‌ సన్నిధానంలో నిర్వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తొలి సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా, నిర్మాత చక్రి తండ్రి శంకర్‌ చిగురుపాటి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. తొలి షాట్‌కు వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఈ నెలాఖరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథ ఇది. సైన్స్‌ ఫిక్షన్‌ కూడా ఉంటుంది.
మంచి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. మలయాళంలో ‘1971’, ‘దృశ్యం’ చిత్రాలకు పనిచేసిన సుజిత్‌ వాసుదేవ్‌ దీనికి సినిమాటోగ్రాఫర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల్ని మెప్పించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com