అబుదాబీలో అక్టోబర్‌ 1 నుంచి కొత్త వంట గ్యాస్‌ విధానం

- September 30, 2015 , by Maagulf
అబుదాబీలో అక్టోబర్‌ 1 నుంచి కొత్త వంట గ్యాస్‌ విధానం

అడ్‌నాక్‌ పంపిణీ ఇక నుంచి నియంత్రిత పద్ధతిలో అమల్లోకి రానుంది. రహల్‌ ఇ-గ్యాస్‌ కార్డ్స్‌ ద్వారా వంట గ్యాస& సిలిండర్లను నెలవారీ కోటా పద్ధతిలో సరఫరా చేస్తుంది. అడ్‌నాక్‌ పంపిణీ వర్గాల సమాచారం ప్రకారం ఎమిరేట్‌ కుటుంబాలకు నెలవారీ 150 దిర్హామ్‌ల విలువ గల ఎల్పీజీ సిలండర్‌లను పొందే అవకాశం ఉంది. అలాగే ఒక్కో ఎమిరేట్‌ పౌరుడికీ 70 దిర్హామ్‌ల విలువైన గ్యాస్‌ సిలండర్‌ మాత్రమే పొందే వీలుంది. వలస కుటుంబాలు, వలస పౌరులకు 70, 40 దిర్హామ్‌లకే కార్డులను పరిమితం చేశారు. 50 దిర్హామ్‌ అదనపు ఫీజుతో రహల్‌ ఇ గ్యాస్‌ కార్డుల్ని అందజేస్తుంది. మొదటిసారి అప్లికేషన్‌ ఫీజ్‌ 200 దిర్హామ్‌ నుంచి 50 దిర్హామ్‌లను మినహాయిస్తారు. అడ్నాక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ సీఈఓ అబ్దుల్లా సలీమ్‌ అల్‌ దహేరీ మాట్లాడుతూ, అందరికీ వంట గ్యాస్‌ అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సబ్సిడీ లేని సిలెండర్ల ధరల్ని సైతం సమీక్షించనున్నట్లు చెప్పారాయన. నగదు చెల్లింపు లేదా క్రెడిట్‌ కార్డ్స్‌ ద్వారా రహల్‌ ఇ కార్డ్స్‌ పొందవచ్చునట. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా ప్రతి నెలా 10వ తేదీన సబ్సిడీ లేని సిలెండర్ల ధరల్ని సవరిస్తామని అడ్‌నాక్‌ సంస్థ వివరించింది. 

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com