అబుదాబీలో అక్టోబర్ 1 నుంచి కొత్త వంట గ్యాస్ విధానం
- September 30, 2015
అడ్నాక్ పంపిణీ ఇక నుంచి నియంత్రిత పద్ధతిలో అమల్లోకి రానుంది. రహల్ ఇ-గ్యాస్ కార్డ్స్ ద్వారా వంట గ్యాస& సిలిండర్లను నెలవారీ కోటా పద్ధతిలో సరఫరా చేస్తుంది. అడ్నాక్ పంపిణీ వర్గాల సమాచారం ప్రకారం ఎమిరేట్ కుటుంబాలకు నెలవారీ 150 దిర్హామ్ల విలువ గల ఎల్పీజీ సిలండర్లను పొందే అవకాశం ఉంది. అలాగే ఒక్కో ఎమిరేట్ పౌరుడికీ 70 దిర్హామ్ల విలువైన గ్యాస్ సిలండర్ మాత్రమే పొందే వీలుంది. వలస కుటుంబాలు, వలస పౌరులకు 70, 40 దిర్హామ్లకే కార్డులను పరిమితం చేశారు. 50 దిర్హామ్ అదనపు ఫీజుతో రహల్ ఇ గ్యాస్ కార్డుల్ని అందజేస్తుంది. మొదటిసారి అప్లికేషన్ ఫీజ్ 200 దిర్హామ్ నుంచి 50 దిర్హామ్లను మినహాయిస్తారు. అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సీఈఓ అబ్దుల్లా సలీమ్ అల్ దహేరీ మాట్లాడుతూ, అందరికీ వంట గ్యాస్ అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సబ్సిడీ లేని సిలెండర్ల ధరల్ని సైతం సమీక్షించనున్నట్లు చెప్పారాయన. నగదు చెల్లింపు లేదా క్రెడిట్ కార్డ్స్ ద్వారా రహల్ ఇ కార్డ్స్ పొందవచ్చునట. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా ప్రతి నెలా 10వ తేదీన సబ్సిడీ లేని సిలెండర్ల ధరల్ని సవరిస్తామని అడ్నాక్ సంస్థ వివరించింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









