అబుదాబీలో అక్టోబర్ 1 నుంచి కొత్త వంట గ్యాస్ విధానం
- September 30, 2015
అడ్నాక్ పంపిణీ ఇక నుంచి నియంత్రిత పద్ధతిలో అమల్లోకి రానుంది. రహల్ ఇ-గ్యాస్ కార్డ్స్ ద్వారా వంట గ్యాస& సిలిండర్లను నెలవారీ కోటా పద్ధతిలో సరఫరా చేస్తుంది. అడ్నాక్ పంపిణీ వర్గాల సమాచారం ప్రకారం ఎమిరేట్ కుటుంబాలకు నెలవారీ 150 దిర్హామ్ల విలువ గల ఎల్పీజీ సిలండర్లను పొందే అవకాశం ఉంది. అలాగే ఒక్కో ఎమిరేట్ పౌరుడికీ 70 దిర్హామ్ల విలువైన గ్యాస్ సిలండర్ మాత్రమే పొందే వీలుంది. వలస కుటుంబాలు, వలస పౌరులకు 70, 40 దిర్హామ్లకే కార్డులను పరిమితం చేశారు. 50 దిర్హామ్ అదనపు ఫీజుతో రహల్ ఇ గ్యాస్ కార్డుల్ని అందజేస్తుంది. మొదటిసారి అప్లికేషన్ ఫీజ్ 200 దిర్హామ్ నుంచి 50 దిర్హామ్లను మినహాయిస్తారు. అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సీఈఓ అబ్దుల్లా సలీమ్ అల్ దహేరీ మాట్లాడుతూ, అందరికీ వంట గ్యాస్ అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సబ్సిడీ లేని సిలెండర్ల ధరల్ని సైతం సమీక్షించనున్నట్లు చెప్పారాయన. నగదు చెల్లింపు లేదా క్రెడిట్ కార్డ్స్ ద్వారా రహల్ ఇ కార్డ్స్ పొందవచ్చునట. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా ప్రతి నెలా 10వ తేదీన సబ్సిడీ లేని సిలెండర్ల ధరల్ని సవరిస్తామని అడ్నాక్ సంస్థ వివరించింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







