ఔత్సాహికులకు ఖతార్ రైల్ ఆహ్వానం
- September 30, 2015
ఖతార్ రైల్వే కంపెనీ (ఖతార్ రైల్), నిర్మాణ రంగంలో అవకాశాల కోసం అవేర్నెస్ క్యాంప్ నిర్వహించింది. దోహా మెట్రో స్టేషన్ పనులకు సంబంధించి, స్థానికంగా ఉన్న ఔత్సాహిక సరఫరాదారులను భాగస్వాముల్ని చేసేందుకు ఈ అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 180 మంది సామర్థ్యం కల భాగస్వాములు, సరఫరాదారులతో 'దోహా మెట్రో ఆర్కిటెక్చరల్ ఫినిషస్' పేరుతో నిర్వహించిన అవేర్నెస్ క్యాంప్ని ప్లాన్ చేయడం జరిగింది. పాల్గొనే ఔత్సాహికులు సలహాలు, సూచనల్ని ఇతరులతో పంచుకోవడం, అదే విధంగా తెలుసుకోవడం ఈ వేదిక లక్ష్యం. ఖతార్ రైల్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మరియు ప్రొక్యూర్మెంట్ కల్దూన్ ట్రూమన్, నిర్మాణదారు ఎంపిక, మెకానిజం, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు వంటి వాటి గురించి తెలియజేశారు. ఖతార్ రైల్కి చెందిన సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మరియు ఎంఈపీ మహమ్మద్ టింబర్లీ మెట్రో రైలుకు సంబంధించిన సరుకు, మరియు అలంకరణ, సాంకేతిక పరమైన అంశాలు మరియు అవసరాల గురించి వివరించారు. ఖతార్ రైల్, స్థానిక నిర్మాణదారులు, సరఫరాదారులతో స్నేహ సంబంధాలు కొనసాగించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఖతార్ నేషనల్ విజన్ 2030లో భాగంగా చేపడుతున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని తెలిపారు. 2018 నాటికి 37 స్టేషన్లతో మెట్రో రైలు ప్రారంభించనున్నారు. 2030 నాటికి 72 స్టేషన్లకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరించనుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









