25 ఫిషర్మెన్లను నిర్బంధించిన ఇరాన్
- April 10, 2017
25 మంది భారతీయ ఫిషర్మెన్ని ఇరాన్ నిర్బంధించింది. తమ దేశ టెరిటోరియల్ వాటర్స్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇండియాలోని కన్యాకుమారికి చెందినవారు. మార్చి 8న బయల్దేరిన ఓ బృందం మార్చి 12న ఇరాన్ నిర్బంధంలోకి వెళ్ళింది. మరో బృందం మార్చి 22న బయల్దేరి వెళ్ళగా ఆ మరుసటి రోజే వారినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసినవారిని కిష్ ఐలాండ్లో ఉంచారని ఇంటర్నేషనల్ ఫిషర్మెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇన్ఫిడెట్ ఫౌండర్ ప్రెసిడెంట్ జస్టిన్ ఆంటోనీ చెప్పారు. ఇరానియన్ లాంగ్వేజ్లో ఉన్న కొన్ని పత్రాలపై ఫిషర్మెన్తో అక్కడి అధికారులు సంతకాలు చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. బాధిత ఫిషర్మెన్ విషయంలో వారి స్పాన్సరర్స్ ఇంతవరకు స్పందించలేదని చెప్పారాయన. అయితే ఓ బోటుకు చెందిన స్పాన్సరర్ మొహమ్మద్ హసన్ మాట్లాడుతూ, ఫిషర్మెన్ ఇరాన్ టెరిటోరియల్ వాటర్స్లోకి అడుగు పెట్టలేదని చెప్పారు. జెగన్, జెనిష్, జోస్ ప్రిన్స్, అరోకియా జాన్ యుఫుర్, జేసుదాసన్, అరోకియా ఎబెస్ బోర్గియో, బాస్కాలిస్, ఆంటోనీ పిచాయ్, ఆంటోనీ సూసాయ్, ఆంటోనీ ప్రమోద్, బోర్జియో ఫ్రాన్సిస్, విక్టర్, విసువాసమ్, ఆరోకియా బెర్విన్ బెస్కి, అరుల్ వివేక్, అరుణ్ ప్రాజిదాన్, సాజన్, సావియో, విలియమ్ ప్రభు, జోసెప్ బెస్కీ, డోమినిక్ సావియో, నిసాంత్, మెరిన్ కుమార్, రాజ్ తిలక్, అన్సన్ తదితరులు అరెస్టయినవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







