తిరిగి వీధులలలో పరుగులు తీయనున్న 25 వేల తత్వేర్ బస్సులు
- April 11, 2017
మధ్యంతర సెలవు ముగిసిన తర్వాత కింగ్డమ్ లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నుంచి 25 వేల బస్సులు పరుగులు పెట్టనున్నాయి. దీనితో ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్ళే సుమారు1.2 మిలియన్ల మంది విద్యార్ధులకి ఆయా బస్సుల ద్వారా తిరిగి రవాణా ప్రారంభమైంది.పాఠశాల రవాణా కోసం విద్య మంత్రిత్వ శాఖ యొక్క కార్యనిర్వాహక విభాగంగా పరిగణించబడుతుంది, ఇది తత్వేర్ (అభివృద్ధి) కంపెనీ, 25,000 కంటే ఎక్కువ స్కూలు బస్సులు 28 వేల డ్రైవర్లు, టెక్నీషియన్లు, నిర్వాహక సిబ్బందితో పాటు మార్గమధ్య పర్యవేక్షకులు 230 మంది అదనంగా బస్సుల ద్వారా తమ తమ సేవలను అమలు పర్చేందుకు సమాయత్తం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అన్ని పాఠశాలలలో నుండి బాల బాలికల విద్యార్థుల ఇరువురికి బస్సుల ద్వారా రవాణా ఉచితంగా అందించబడుతుంది.తత్వేర్ సంస్థ యొక్క అధికారిక ప్రతినిధి మజీద్ గీలాబ్ అల్ మరి మాట్లాడుతూ, తత్వేర్ అనేక సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రవాణా సేవలను అందించనుంది. విద్యార్థిని విద్యార్థులను తమ బస్సుల ద్వారా వారి తరగతులకు మొదటి రోజు నుండి సురక్షితంగా మృదువైన రవాణా చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









