పేలని బాంబుతో ఆటలు.. చిన్నారులు మృతి

- April 11, 2017 , by Maagulf
పేలని బాంబుతో ఆటలు.. చిన్నారులు మృతి

కాబూల్‌: పేలకుండా పడిపోయ ఉన్న మోర్టార్‌ రౌండ్‌తో ఆడుకుంటూ నలుగురు చిన్నారులు మృత్యువాతపడిన విషాదకర ఘటన ఆఫ్ఘనిస్థాన్‌లో చోటుచేసుకుంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న కుందుజ్‌ రాష్ట్రంలో కొందరు చిన్నారులు మోర్టార్‌ రౌండ్‌తో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది పేలింది. దీంతో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు చిన్నారులు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ పేలని బాంబులు, ప్రమాదకర వస్తువులు, మోర్టార్‌ రౌండ్స్‌ పడిపోయి ఉంటున్నాయి. అవి అకస్మాత్తుగా పేలడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి నెలా రోడ్ల పక్కన పడిన బాంబులు పేలి చనిపోయే, గాయాలపాలయ్యే వారి సంఖ్య దాదాపు 140 ఉంటుందని అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com