పేలని బాంబుతో ఆటలు.. చిన్నారులు మృతి
- April 11, 2017
కాబూల్: పేలకుండా పడిపోయ ఉన్న మోర్టార్ రౌండ్తో ఆడుకుంటూ నలుగురు చిన్నారులు మృత్యువాతపడిన విషాదకర ఘటన ఆఫ్ఘనిస్థాన్లో చోటుచేసుకుంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న కుందుజ్ రాష్ట్రంలో కొందరు చిన్నారులు మోర్టార్ రౌండ్తో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది పేలింది. దీంతో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు చిన్నారులు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో యుద్ధాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ పేలని బాంబులు, ప్రమాదకర వస్తువులు, మోర్టార్ రౌండ్స్ పడిపోయి ఉంటున్నాయి. అవి అకస్మాత్తుగా పేలడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి నెలా రోడ్ల పక్కన పడిన బాంబులు పేలి చనిపోయే, గాయాలపాలయ్యే వారి సంఖ్య దాదాపు 140 ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







