షిర్డీకి విమాన రాకపోకలు..షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త
- April 12, 2017
సాయిబాబా భక్తులకు శుభవార్త. మే నెల నుంచి షిర్డీకి విమానాల రాకపోకలపై పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. షిర్డీ ఎయిర్పోర్టును మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ పూర్తిగా సన్నద్ధం చేస్తోంది. విమానాశ్రయం పనులు చివరి దశలో ఉన్నాయి. అహ్మద్నగర్ జిల్లాలో సిద్ధమవుతున్న ఈ విమానాశ్రయమే ఎంఏడీసీ నిర్మించిన తొలి ఎయిర్పోర్ట్. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుతో పాటు దేశంలో పలు నగరాల నుంచి షిర్డీకి విమానాలు నడపనున్నారు. 2002లో ఎంఏడీసీని స్థాపించిన తరవాత నిర్మించిన తొలి ఎయిర్పోర్టు షిర్డీదే. మొదటగా షిర్డీకి దేశీయ విమానాలనే నడపనున్నారు. ఆ తరువాత రద్దీని బట్టి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది. మొదట రోజుకి నాలుగు నుంచి ఐదు విమానాలు నడపాలని నిర్ణయించారు. షిర్డీ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే 340 కోట్లు మంజూరు చేసింది.
షిర్డీ సాయిబాబా మహాశతాబ్ది మహోత్సవాన్ని వైభవోపేతంగా జరపడానికి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ 18 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం 3వేల కోట్లు కేటాయించింది. ఈ ఉత్సవాలకు సాయిబాబా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయలు కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే విమానాశ్రయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. రైళ్లు, బస్సుల్లో ప్రయాణానికి ఇబ్బంది పడే వారికి విమాన సర్వీసులతో మేలు జరగనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







