తొక్కిసలాటలో ఇంకా దొరకని వందలాది మంది ఆచూకీ
- October 01, 2015
ఇటీవల పవిత్ర మక్కా ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ఆచూకీ ఇంకా తెలియరావడంలేదు. 769 మంది ఈ తొక్కిసలాటలో మరణించినట్లు అధికారికంగా వెల్లడైనా, అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 934గా ఉంది. 23 దేశాలకు చెందిన వారు మృతుల్లో ఉన్నారు. 600 మందికి పైగా వ్యక్తుల సమాచారం లభించకపోవడంతో వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. ఇరాన్కి చెందిన 239 చనిపోయినట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ సంఖ్య ఇప్పుడు 464కి చేరింది. ఈ ఘోరానికి సౌదీ అరేబియా బాధ్యత వహించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. భారతదేశానికి చెందిన 51 మంది చనిపోగా, పాకిస్తాన్ నుంచి వచ్చినవారిలో 46 మంది చనిపోయినట్లు తేలింది. ఈజిప్ట్ నుంచి 75 మంది చనిపోగా 95 మంది ఆచూకీ తెలియలేదు. నైజీరియా 64 మంది మరణాన్ని ధృవీకరించగా, ఆ దేశానికి చెందిన 244 మంది ఆచూకీ గల్లంతయ్యింది. ఆచూకీ గల్లంతయినవారి కోసం పరిశోధనా చర్యలు ముమ్మరం చేసినా ప్రయోజనం లేకపోతోంది.
--మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







