తొక్కిసలాటలో ఇంకా దొరకని వందలాది మంది ఆచూకీ

- October 01, 2015 , by Maagulf
తొక్కిసలాటలో ఇంకా దొరకని వందలాది మంది ఆచూకీ

ఇటీవల పవిత్ర మక్కా ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ఆచూకీ ఇంకా తెలియరావడంలేదు. 769 మంది ఈ తొక్కిసలాటలో మరణించినట్లు అధికారికంగా వెల్లడైనా, అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 934గా ఉంది. 23 దేశాలకు చెందిన వారు మృతుల్లో ఉన్నారు. 600 మందికి పైగా వ్యక్తుల సమాచారం లభించకపోవడంతో వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. ఇరాన్‌కి చెందిన 239 చనిపోయినట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ సంఖ్య ఇప్పుడు 464కి చేరింది. ఈ ఘోరానికి సౌదీ అరేబియా బాధ్యత వహించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. భారతదేశానికి చెందిన 51 మంది చనిపోగా, పాకిస్తాన్‌ నుంచి వచ్చినవారిలో 46 మంది చనిపోయినట్లు తేలింది. ఈజిప్ట్‌ నుంచి 75 మంది చనిపోగా 95 మంది ఆచూకీ తెలియలేదు. నైజీరియా 64 మంది మరణాన్ని ధృవీకరించగా, ఆ దేశానికి చెందిన 244 మంది ఆచూకీ గల్లంతయ్యింది. ఆచూకీ గల్లంతయినవారి కోసం పరిశోధనా చర్యలు ముమ్మరం చేసినా ప్రయోజనం లేకపోతోంది. 

 

--మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com