తొక్కిసలాటలో ఇంకా దొరకని వందలాది మంది ఆచూకీ
- October 01, 2015
ఇటీవల పవిత్ర మక్కా ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ఆచూకీ ఇంకా తెలియరావడంలేదు. 769 మంది ఈ తొక్కిసలాటలో మరణించినట్లు అధికారికంగా వెల్లడైనా, అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 934గా ఉంది. 23 దేశాలకు చెందిన వారు మృతుల్లో ఉన్నారు. 600 మందికి పైగా వ్యక్తుల సమాచారం లభించకపోవడంతో వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. ఇరాన్కి చెందిన 239 చనిపోయినట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ సంఖ్య ఇప్పుడు 464కి చేరింది. ఈ ఘోరానికి సౌదీ అరేబియా బాధ్యత వహించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. భారతదేశానికి చెందిన 51 మంది చనిపోగా, పాకిస్తాన్ నుంచి వచ్చినవారిలో 46 మంది చనిపోయినట్లు తేలింది. ఈజిప్ట్ నుంచి 75 మంది చనిపోగా 95 మంది ఆచూకీ తెలియలేదు. నైజీరియా 64 మంది మరణాన్ని ధృవీకరించగా, ఆ దేశానికి చెందిన 244 మంది ఆచూకీ గల్లంతయ్యింది. ఆచూకీ గల్లంతయినవారి కోసం పరిశోధనా చర్యలు ముమ్మరం చేసినా ప్రయోజనం లేకపోతోంది.
--మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









