షార్జాలో అగ్ని ప్రమాదం: నీడ కోల్పోయిన 250 కుటుంబాలు
- October 01, 2015
షార్జాలో 32 అంతస్తులు కలిగిన ఓ భారీ భవంతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో 250 కుటుంబాలు నీడ కోల్పోయాయి. ఇందులో 6 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించగా, మిగతా 26 ఫ్లోర్లలోని ఫ్లాట్స్లో 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఎవరూ తీవ్రంగా గాయపడటంగానీ, ప్రాణాలు కోల్పోవడంగానీ జరగలేదు. ఆరవ లెవల్ పార్కింగ్లో 14 కార్లు మాత్రం తీవ్రంగా ధ్వంసమయ్యాయి. 40 మంది నివాసితులకు చిన్నపాటి గాయాలయ్యాయి. వారందరికీ ప్రాథమిక చికిత్స అందించారు. గతంలో కాంటినెంటల్ పేరుతో ఉన్న ఈ భవంతి, ప్రస్తుతం అల్ నాజర్ టవర్ పేరుతో ఉంది. భవంతిలో సరైన రక్షణ చర్యలు లేవని, విద్యుత్ కేబుళ్ళు బయటకు వచ్చి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినా భవంతి యజమాని పట్టించులేదని ఫ్లాట్లలో నివసిస్తున్నవారు వాపోయారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







