షార్జాలో అగ్ని ప్రమాదం: నీడ కోల్పోయిన 250 కుటుంబాలు
- October 01, 2015
షార్జాలో 32 అంతస్తులు కలిగిన ఓ భారీ భవంతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో 250 కుటుంబాలు నీడ కోల్పోయాయి. ఇందులో 6 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించగా, మిగతా 26 ఫ్లోర్లలోని ఫ్లాట్స్లో 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఎవరూ తీవ్రంగా గాయపడటంగానీ, ప్రాణాలు కోల్పోవడంగానీ జరగలేదు. ఆరవ లెవల్ పార్కింగ్లో 14 కార్లు మాత్రం తీవ్రంగా ధ్వంసమయ్యాయి. 40 మంది నివాసితులకు చిన్నపాటి గాయాలయ్యాయి. వారందరికీ ప్రాథమిక చికిత్స అందించారు. గతంలో కాంటినెంటల్ పేరుతో ఉన్న ఈ భవంతి, ప్రస్తుతం అల్ నాజర్ టవర్ పేరుతో ఉంది. భవంతిలో సరైన రక్షణ చర్యలు లేవని, విద్యుత్ కేబుళ్ళు బయటకు వచ్చి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినా భవంతి యజమాని పట్టించులేదని ఫ్లాట్లలో నివసిస్తున్నవారు వాపోయారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









