షార్జాలో అగ్ని ప్రమాదం: నీడ కోల్పోయిన 250 కుటుంబాలు
- October 01, 2015
షార్జాలో 32 అంతస్తులు కలిగిన ఓ భారీ భవంతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో 250 కుటుంబాలు నీడ కోల్పోయాయి. ఇందులో 6 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించగా, మిగతా 26 ఫ్లోర్లలోని ఫ్లాట్స్లో 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఎవరూ తీవ్రంగా గాయపడటంగానీ, ప్రాణాలు కోల్పోవడంగానీ జరగలేదు. ఆరవ లెవల్ పార్కింగ్లో 14 కార్లు మాత్రం తీవ్రంగా ధ్వంసమయ్యాయి. 40 మంది నివాసితులకు చిన్నపాటి గాయాలయ్యాయి. వారందరికీ ప్రాథమిక చికిత్స అందించారు. గతంలో కాంటినెంటల్ పేరుతో ఉన్న ఈ భవంతి, ప్రస్తుతం అల్ నాజర్ టవర్ పేరుతో ఉంది. భవంతిలో సరైన రక్షణ చర్యలు లేవని, విద్యుత్ కేబుళ్ళు బయటకు వచ్చి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినా భవంతి యజమాని పట్టించులేదని ఫ్లాట్లలో నివసిస్తున్నవారు వాపోయారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







