ఒక్క రోజులో 105,182 మంది ప్రయాణీకులు

- October 01, 2015 , by Maagulf
ఒక్క రోజులో 105,182 మంది ప్రయాణీకులు

కింగ్‌ పహాద్‌ కాజ్‌వే మీదుగా ఆదివారం రికార్డు స్థాయిలో ప్రయాణీకులు ప్రయాణించారు. 1986లో ఈ కాజ్‌వే ప్రారంభమైన తర్వాత ఇదే పెద్ద రికార్డ్‌. హజ్‌ యాత్రికులు సౌదీ అరేబియా నుంచి తిరుగు ప్రయాణమయ్యే మార్గంలో ఉంటుంది. సెప్టెంబర్‌ 19 నుంచి 28 గల వారంలో 514,773 మంది ఈ కాజ్‌వేపై ప్రయాణించారు. మే 2న రికార్డు స్థాయిలో 104,400 మంది ప్రయాణించగా, ఆ రికార్డుని బ్రేక్‌ చేస్తూ ఆదివారం 105,182 మంది ప్రయాణించడం గొప్ప విషయం. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో హజ్‌ యాత్రికుల ప్రయాణం సాఫీగా సాగింది. పాస్‌ పోర్ట్‌ వెరిఫికేషన్‌ వంటి వాటిల్లో తగు చర్యలు తీసుకున్నారు. 

 

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com