సినీ ప్రియులకి బ్యాడ్ న్యూస్: సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయ్
- April 18, 2017
సినీ ప్రియులకి బ్యాడ్ న్యూస్. సినిమా టికెట్ ధరలు పెరగనున్నట్టు సమాచారమ్. ఈ మేరకు ఇండస్ట్రీ చెందిన బడా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇదే జరిగితే.. సినీ ప్రియులకి ఇంతకంటే పెద్ద బ్యాడ్ న్యూస్ మరోటి ఉండడు.
ఇప్పటికే మల్టీ పెక్సులు వచ్చిన తర్వాత టికెట్ ధరలు ఓ రేంజ్ లో పెరిగాయ్. మల్టీపెక్స్ లో మినిమమ్ టికెట్ ధర రూ. 150. ఓ ఫ్యామిలీ మల్టీ పెక్స్ లో సినిమా చూడాలంటే తడిసిమోపడు అవుతుంది. అదీగాక, మల్టీ పెక్స్ లో టికెట్ ధర కంటే స్నాక్స్ రేటు అధికం. ఈ రేట్ల భరించలేక ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్ ఓ నెలపాటు ఆగి.. హాయిగా సినిమా టీవీల్లో చూసేస్తున్నారు. ఇప్పుడు టికెట్ ధరలు పెంచినట్టయితే.. ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేయడమే.
మరోవైపు, ప్యాకెట్ మణితో సినిమా చూసే స్టూడెంట్స్ మరింత భారం కానుంది. అప్పుడు సినిమా చూడాలంటే మరిన్ని కారణాలు వెతుక్కోవాలి. అలాగైతేనేగా ఇంట్లో డబ్బులు ఇచ్చేది. నేరుగా సినిమా చూస్తాం డబ్బులు ఇవ్వమంటే తల్లిదండ్రులు ఇస్తారా.. ? తోలు తీసేయ్యరూ.. !!
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







