జియో డిస్కౌంట్ ఆఫర్ విమాన టిక్కెట్ పై
- April 18, 2017
ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందించేందుకు సిద్ధమైందట. ఏయిర్ ఏసియా టిక్కెట్లపై 15 శాతం వరకు డిస్కౌంట్ను అందించనున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ రిపోర్టు చేసింది. ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్ను వినియోగదారుల సద్వినియోగం చేసుకోవచ్చని, 2017 జూన్ 20 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకున్న ప్రయాణ సమయాల్లో ఇది వర్తిస్తుందని నివేదించింది.
వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈ ఆఫర్ను లాంచ్ చేయబోతున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ రిపోర్టు పేర్కొంది. ఈ విమానయాన సంస్థ మొదట ఈ ఆఫర్ గురించి ఓ ట్వీట్ చేసింది. అనంతరం వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ప్రత్యర్థ కంపెనీల అత్యధిక ఏఆర్పీయూ(ఒక్కో యూజరుపై ఆర్జించే కనీస రెవెన్యూ) యూజర్లను టార్గెట్ చేసుకుని జియో ఈ వ్యూహాన్ని అమల్లోకి తెస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







