నగదు ఎక్సేంజ్ రేట్లను పెంచి. షాక్ ఇఛ్చిన ఎక్సేంజ్ హౌజ్లు
- April 18, 2017
విదేశాలకు వెళ్లి కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నవారికి ఎక్సేంజ్ హౌజ్లు షాకిస్తున్నాయి. యూఏఈలో నివసిస్తున్న వారు సంపాదించిన నగదును తమ స్వదేశాలకు పంపుకోవడం కాస్ట్లీగా మారుతోంది. ఈ వారంలో ఎక్సేంజ్ ఏజెన్సీలు రెమిటెన్స్లపై వసూలు చేసే ఛార్జీలను పెంచినట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 15 నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్లకు డీహెచ్2(రూ.35.12) వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అదేవిధంగా కొన్ని ఎక్సేంజ్లపై కూడా ఫీజులను ఏప్రిల్ మొదటివారం నుంచి పెంచినట్లు తెలిపాయి. ఒక్కో లావాదేవీపై వేసే సర్వీసు ఛార్జీల రేట్లను కూడా పెంచినట్లు ఆ ఏజెన్సీలు తెలిపాయి. ఛార్జీలను పెంచిన లీడింగ్ ఎక్సేంజ్ హౌజ్లన్నీ, ఫారిన్ ఎక్సేంజ్ అండ్ రెమిటెన్స్ గ్రూప్లో సభ్యులు. ఇది యూఏఈలోని మనీ ఎక్సేంజ్ హౌజ్లకు అధికారిక ప్లాట్ఫామ్. అయితే ఈ నిర్ణయం తమది కాదని ఎఫ్ఈఆర్జీ ఛైర్మన్ మహ్మద్ అల్ అన్సారీ చెప్పారు. స్వల్పంగా ఛార్జీలు పెంచుకోమనే సూచించామని, వాటిపై తుది నిర్ణయం సభ్యులే తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







