కాసుల పంట పండించిన ఘాజి సినిమా
- April 19, 2017
రానా బాహుబలి1 సినిమా తర్వాత చేస్తోన్న సినిమాగానే కాదు.. దేశంలో తొలిసారి సబ్ మెరైన్ నేపద్యంతో తెరకెక్కుతున్న సినిమాగా వార్తల్లో నిలవడంతో అందరినీ ఆకర్షించింది.. ఓ కొత్త దర్శకుడు తీస్తున్నా ఈ సినిమా రిలీజ్ కోసం దేశం అంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అంటే ఈ సినిమా కోసం ఎంచుకొన్న కాన్సెప్ట్.. ఎక్కువ భాగం ఓ సబ్ మెరైన్ లో ఉన్న ఈ సినిమా అంచనాలకు మించి విజయాన్ని అందుకొన్నది.. తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లో రిలీజైన ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా ఫుల్ రన్ లో భారీ వసూళ్లను అందుకొన్నది. ఉత్తరాంధ్రా 1.55 కోట్లు, తూర్పు గోదావరి 0.65 కోట్లు, పశ్చిమ గోదావరి 0.45 కోట్లు, కృష్ణా గుంటూరు 0.75 కోట్లు, నెల్లూరు 0.30 కోట్లు నైజాం నుంచి 4.50 కోట్లు, సీడెడ్ నుంచి 0.80 కోట్లు వసూలు అయ్యాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9.8 కోట్ల కలెక్షన్, తమిళనాడు లో 2.40 కోట్లు.. కర్నాటక నుంచి 2 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 10.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మూడు భాషల్లో రిలీజైన ఘజి దేశ వ్యాప్తంగా 24.45 కోట్లు వసూలు చేసింది.. యూఎస్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకొన్న ఘజి 2 కోట్లను వసూలు చేసుకోగా.. రెస్టాఫ్ వరల్డ్ 0.65 కోట్లు వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా లాంగ్ రన్ లో 27.1 కోట్లను వసూలు చేసింది.. బాహుబలి1 తర్వాత రానా చేసిన సినిమా అయినా ఓ కొత్త దర్శకుడు.. కొత్త నేపద్యం అయినా ఇన్ని కోట్లు వసూలు చేసింది అంటే రికార్డ్ అని చెప్పాలి.. పైగా సినిమా ను అతి తక్కువ ఖర్చుతో తెరకెక్కించడంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది అని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







