మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న ఆశిష్ రాజ్
- April 19, 2017
ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన "ఆకతాయి" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు ఆశిష్ రాజ్.. మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. "ఆకతాయి" చిత్ర నిర్మాతలైన కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ లు మరో మారు సంయుక్తంగా ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇకపోతే.. మార్చి 10న విడుదలైన "ఆకతాయి"కి సరైన థియేటర్లు దొరకని కారణంగా కొన్ని ఏరియాల్లో విడుదల కాలేదు, అందుకోసం "ఆకతాయి" చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో మరోమారు విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ మాట్లాడుతూ.. "యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన మా "ఆకతాయి"ని ఆదరించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ఆ సినిమాకి లభించిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొనే మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నాం. ఆగస్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాపులర్ హీరోయిన్ ఆశిష్ రాజ్ సరసన నటించనుంది. ఓ యువ ప్రతిభాశాలిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయనున్నాం. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అన్నారు!
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









