30మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష పాకిస్థాన్‌లో

- April 19, 2017 , by Maagulf
30మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష పాకిస్థాన్‌లో

కరడు గట్టిన ఉగ్రవాదులు 30 మందికి విధించిన ఉరిశిక్ష అమలు ఉత్తర్వులపై పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ జావేద్‌ బజ్వా బుధవారం సంతకం చేశారు. 2014లో పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై దాడి చేసి 150 మందిని విచక్షణా రహితంగా కాల్చి చంపటం సహా పలు ఉగ్ర ఘటనలతో ఈ ఉగ్రవాదులకు సంబంధం ఉందని సైనిక ప్రత్యేక కోర్టు మరణ దండన విధించింది. 2015లో ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com