ముమ్మరంగా మోదీ విదేశీ పర్యటనలు మే 12 నుంచి
- April 19, 2017
వచ్చే నెల నుంచీ జులై వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముమ్మరంగా విదేశీపర్యటనలు జరపనున్నారు. శ్రీలంకతో ఆయన పర్యటనల షెడ్యూలు మొదలౌతుంది. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, జర్మనీ, స్పెయిన్, కజికిస్థాన్లలో మోదీ పర్యటిస్తారని అధికారులు బుధవారం నాడిక్కడ వెల్లడించారు. .
* మేనెల 12 నుంచీ 14వ తేదీ వరకూ మోదీ శ్రీలంకలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఐరాస వేసక్ దినోత్సవాల్లో.. అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొంటారు.
* జూన్ 1 నుంచీ 3వ తేదీ వరకూ మోదీ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించనున్న సెయింట్పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటారు.
* జూన్ 7-8 తేదీల్లో కజిగిస్థాన్లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ సమావేశానికి హాజరౌతారు. ఈ సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కూడా హాజరు కావచ్చని భావిస్తున్నారు.
* తర్వాత...అంటే జులై 7-8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్లో జరగాల్సి ఉన్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరౌతారు.
* ఇక, అమెరికా, ఇజ్రాయెల్లలో ప్రధాని పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







