ముమ్మరంగా మోదీ విదేశీ పర్యటనలు మే 12 నుంచి
- April 19, 2017
వచ్చే నెల నుంచీ జులై వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముమ్మరంగా విదేశీపర్యటనలు జరపనున్నారు. శ్రీలంకతో ఆయన పర్యటనల షెడ్యూలు మొదలౌతుంది. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, జర్మనీ, స్పెయిన్, కజికిస్థాన్లలో మోదీ పర్యటిస్తారని అధికారులు బుధవారం నాడిక్కడ వెల్లడించారు. .
* మేనెల 12 నుంచీ 14వ తేదీ వరకూ మోదీ శ్రీలంకలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఐరాస వేసక్ దినోత్సవాల్లో.. అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొంటారు.
* జూన్ 1 నుంచీ 3వ తేదీ వరకూ మోదీ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించనున్న సెయింట్పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటారు.
* జూన్ 7-8 తేదీల్లో కజిగిస్థాన్లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ సమావేశానికి హాజరౌతారు. ఈ సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కూడా హాజరు కావచ్చని భావిస్తున్నారు.
* తర్వాత...అంటే జులై 7-8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్లో జరగాల్సి ఉన్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరౌతారు.
* ఇక, అమెరికా, ఇజ్రాయెల్లలో ప్రధాని పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









