ముమ్మరంగా మోదీ విదేశీ పర్యటనలు మే 12 నుంచి
- April 19, 2017
వచ్చే నెల నుంచీ జులై వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముమ్మరంగా విదేశీపర్యటనలు జరపనున్నారు. శ్రీలంకతో ఆయన పర్యటనల షెడ్యూలు మొదలౌతుంది. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, జర్మనీ, స్పెయిన్, కజికిస్థాన్లలో మోదీ పర్యటిస్తారని అధికారులు బుధవారం నాడిక్కడ వెల్లడించారు. .
* మేనెల 12 నుంచీ 14వ తేదీ వరకూ మోదీ శ్రీలంకలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఐరాస వేసక్ దినోత్సవాల్లో.. అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొంటారు.
* జూన్ 1 నుంచీ 3వ తేదీ వరకూ మోదీ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించనున్న సెయింట్పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటారు.
* జూన్ 7-8 తేదీల్లో కజిగిస్థాన్లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ సమావేశానికి హాజరౌతారు. ఈ సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కూడా హాజరు కావచ్చని భావిస్తున్నారు.
* తర్వాత...అంటే జులై 7-8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్లో జరగాల్సి ఉన్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరౌతారు.
* ఇక, అమెరికా, ఇజ్రాయెల్లలో ప్రధాని పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









