'తెలుగు స్రవంతి' ఆధ్వర్యంలో గాంధీ జయంతి

- October 02, 2015 , by Maagulf

తెలుగు స్రవంతి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తెలుగు స్రవంతి, సేవా కార్యక్రమాలను నిర్వహించింది. సోనాపోర్లోని లేబర్ క్యాంప్ వద్ద ఆహార పొట్లాల పంపిణీ చేపట్టారు. లక్ష్మీ రెడ్డి అధ్యక్షతన ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీపికా బాబా సుధాకర్రావు, సుబ్బారెడ్డి, లక్ష్మీ పానియాల, నాగార్జునరావు, వెంకట్ రెడ్డి, మాల గోపీనాథ్, లతా నగేష్, రాజేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. శేఖర్రెడ్డి స్పాన్సర్గా వ్యవహరించారు. 

 

మాగల్ఫ్.కామ్ తరపున 'తెలుగు స్రవంతి' వారికి ప్రత్యేక అభినందనలు.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com