భారీ ధర పలికిన మహాత్మాగాంధీ స్టాంప్
- April 20, 2017
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీకి యూకేలో ఇంత ధర పలకటం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ భారత స్టాంప్కు ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు వేలం నిర్వాహకులు చెప్పారు. ఇందులో నాలుగింటిని ఇప్పుడు వేలం వేయగా.. మరో నాలుగు రాయల్ ఫిలాటెలిక్ కలెక్షన్ హౌస్లో ఉన్నట్లు తెలిపారు. ఈ కలెక్షన్ హౌస్ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు చెందినది.
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులను బ్రిటన్లో వేలం వేశారు. వేలంలో అవి రికార్డు ధర పలికాయి. యూకేలోని స్టాన్లీ గిబ్బన్స్ అనే స్టాంప్ కలెక్టింగ్ కంపెనీ గాంధీ బొమ్మతో ఉన్న నాలుగు స్టాంపులను వేలం వేసింది. రికార్డు స్థాయిలో అవి 5లక్షల పౌండ్లు పలికాయి. భారత కరెన్సీలో అయితే అది 4 కోట్లు. వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









