లవర్ కోసం విమానం హైజాక్ చేస్తానంటూ డ్రామా!
- April 20, 2017
విమానాలను హైజాక్ చేస్తానంటూ ముంబై పోలీసులకు ఈ-మెయిల్ చేసిన యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ట్రావెల్ ఏజంట్ వంశీ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని గుర్తించారు. ఎస్సార్ నగర్ లో ఇతడిని అదుపులోకి తీసుకుని ఐటీ చట్టంలోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తన ప్రియురాలి అలక తీర్చడానికి ఇతగాడు ఆడిన నాటకం వారిని ఆశ్చర్యపరిచింది. విమానాలను హైజాక్ చేస్తానంటూ ఈ నెల 16 న ముంబై పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు సమాచారం అందింది. దీంతో అధికారులు ముంబై, చెన్నై, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి హై అలర్ట్ ప్రకటించారు.
ఓ మహిళ ఆరుగురు యువకులతో కలిసి విమానాలను హైజాక్ చేసే అవకాశం ఉందన్నదే ఆ ఈ-మెయిల్ సారాంశం. ముంబై ఖాకీల దర్యాప్తులో ఈ-మెయిల్ హైదరాబాద్ నుంచి వచ్చిందని తెలిసి సిటీ పోలీసుల సాయం కోరారు. వారి అభ్యర్ధనపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి చివరకు నిందితుడిని పట్టుకున్నారు. చెన్నైలో ఉంటున్న వంశీ ప్రియురాలు.. ఈ సమ్మర్ లో ముంబై, గోవా వంటి ప్రాంతాలకు సరదాగా హాలిడే ట్రిప్ వేద్దామని అతడ్నికోరిందని, అయితే తన దగ్గర డబ్బుల్లేవని వంశీ చెప్పినా ఆమె వినిపించుకోకపోవడంతో, విమానాల హైజాక్ బెదిరింపులు చేస్తే టూర్ రద్దవుతుందన్న ఆలోచనతో వంశీ ఈ పథకం పన్నాడని తెలిసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









