లవర్ కోసం విమానం హైజాక్ చేస్తానంటూ డ్రామా!
- April 20, 2017
విమానాలను హైజాక్ చేస్తానంటూ ముంబై పోలీసులకు ఈ-మెయిల్ చేసిన యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ట్రావెల్ ఏజంట్ వంశీ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని గుర్తించారు. ఎస్సార్ నగర్ లో ఇతడిని అదుపులోకి తీసుకుని ఐటీ చట్టంలోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తన ప్రియురాలి అలక తీర్చడానికి ఇతగాడు ఆడిన నాటకం వారిని ఆశ్చర్యపరిచింది. విమానాలను హైజాక్ చేస్తానంటూ ఈ నెల 16 న ముంబై పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు సమాచారం అందింది. దీంతో అధికారులు ముంబై, చెన్నై, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి హై అలర్ట్ ప్రకటించారు.
ఓ మహిళ ఆరుగురు యువకులతో కలిసి విమానాలను హైజాక్ చేసే అవకాశం ఉందన్నదే ఆ ఈ-మెయిల్ సారాంశం. ముంబై ఖాకీల దర్యాప్తులో ఈ-మెయిల్ హైదరాబాద్ నుంచి వచ్చిందని తెలిసి సిటీ పోలీసుల సాయం కోరారు. వారి అభ్యర్ధనపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి చివరకు నిందితుడిని పట్టుకున్నారు. చెన్నైలో ఉంటున్న వంశీ ప్రియురాలు.. ఈ సమ్మర్ లో ముంబై, గోవా వంటి ప్రాంతాలకు సరదాగా హాలిడే ట్రిప్ వేద్దామని అతడ్నికోరిందని, అయితే తన దగ్గర డబ్బుల్లేవని వంశీ చెప్పినా ఆమె వినిపించుకోకపోవడంతో, విమానాల హైజాక్ బెదిరింపులు చేస్తే టూర్ రద్దవుతుందన్న ఆలోచనతో వంశీ ఈ పథకం పన్నాడని తెలిసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







