లవర్ కోసం విమానం హైజాక్ చేస్తానంటూ డ్రామా!
- April 20, 2017
విమానాలను హైజాక్ చేస్తానంటూ ముంబై పోలీసులకు ఈ-మెయిల్ చేసిన యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ట్రావెల్ ఏజంట్ వంశీ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని గుర్తించారు. ఎస్సార్ నగర్ లో ఇతడిని అదుపులోకి తీసుకుని ఐటీ చట్టంలోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తన ప్రియురాలి అలక తీర్చడానికి ఇతగాడు ఆడిన నాటకం వారిని ఆశ్చర్యపరిచింది. విమానాలను హైజాక్ చేస్తానంటూ ఈ నెల 16 న ముంబై పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు సమాచారం అందింది. దీంతో అధికారులు ముంబై, చెన్నై, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి హై అలర్ట్ ప్రకటించారు.
ఓ మహిళ ఆరుగురు యువకులతో కలిసి విమానాలను హైజాక్ చేసే అవకాశం ఉందన్నదే ఆ ఈ-మెయిల్ సారాంశం. ముంబై ఖాకీల దర్యాప్తులో ఈ-మెయిల్ హైదరాబాద్ నుంచి వచ్చిందని తెలిసి సిటీ పోలీసుల సాయం కోరారు. వారి అభ్యర్ధనపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి చివరకు నిందితుడిని పట్టుకున్నారు. చెన్నైలో ఉంటున్న వంశీ ప్రియురాలు.. ఈ సమ్మర్ లో ముంబై, గోవా వంటి ప్రాంతాలకు సరదాగా హాలిడే ట్రిప్ వేద్దామని అతడ్నికోరిందని, అయితే తన దగ్గర డబ్బుల్లేవని వంశీ చెప్పినా ఆమె వినిపించుకోకపోవడంతో, విమానాల హైజాక్ బెదిరింపులు చేస్తే టూర్ రద్దవుతుందన్న ఆలోచనతో వంశీ ఈ పథకం పన్నాడని తెలిసింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









