ఈ నెల 24 నుంచి తాజా గోల్డ్ బాండ్ స్కీమ్
- April 20, 2017
సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) తాజా సబ్స్క్రిప్షన్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది మొదటి గోల్డ్ బాండ్ స్కీమ్. మార్కెట్ విలువకన్నా గ్రాముకు రూ.50 తక్కువగా బాండ్ విలువ ఉంటుంది. వార్షిక వడ్డీ 2.75 శాతం. తొలి ఇన్వెస్ట్మెంట్పై ప్రతి ఆరునెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఈ బాండ్లకు ఏప్రిల్ 24–28 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. బాండ్ల కాలపరిమితి ఐదవ ఏడాది నుంచి ‘ఎగ్జిట్’ ఆప్షన్తో ఎనిమిది సంవత్సరాలు.
ఒక వార్షిక సంవత్సరంలో గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేసే వీలుంది. సబ్స్క్రిప్షన్కు వారం ముందు (సోమవారం–శుక్రవారం) ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ నిర్ణయించిన 999 ప్యూరిటీ గోల్డ్ ధర సగటును బాండ్ ధరగా స్థిరీకరించడం జరుగుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్హెచ్సీఐఎల్), నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్, బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బాండ్లు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









