అమెరికాకు రాయబారిగా ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్
- April 22, 2017
రియాద్: అమెరికాలో సౌదీఅరేబియా రాయబారిగా సౌదీ రాజు సల్మాన్.. తన కుమారుడు ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ను నియమించారు. ఈ మేరకు సౌదీ అధికారిక ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ‘అమెరికాకు రాయబారిగా ఉన్న ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫైజల్ బిన్ టుర్కీని తొలగించి.. ఆ స్థానంలో ఖలీద్ను నియమించారు’ అని సౌదీ అధికారిక మీడియా పేర్కొంది. సల్మాన్ కేబినెట్లో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ నియామకం చేపట్టినట్లు మీడియా వెల్లడించింది. దీంతోపాటు సైన్యానికి కూడా కొత్త అధిపతిని నియమిస్తూ.. రాజు సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రిన్స్ ఖలీద్ ఇప్పటివరకు ఎయిర్ఫోర్స్ పైలట్గా వ్యహరించారు. ఇస్లామిక్స్టేట్కు వ్యతిరేకంగా ఏర్పడిన సంకీర్ణ దళాల యుద్ధవిమానాలకు పైలట్గా పనిచేశారు. కాగా.. సౌదీ రాజు సల్మాన్ మరో కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్.. ప్రస్తుతం రక్షణ మంత్రిగా కొనసాగుతున్నారు.
ఇప్పటివరకు అమెరికాకు రాయబారిగా ఉన్న అబ్దుల్లా కేవలం ఏడాది క్రితమే ఆ బాధ్యతలు చేపట్టారు. కాగా.. ప్రస్తుతం కేబినెట్లో జరిగిన మార్పుల నేపథ్యంలో ఆ బాధ్యతలను సల్మాన్ తన కుమారుడికి అప్పగించారు. మరోవైపు ఒబామా నేతృత్వంలో సౌదీ, అమెరికా మధ్య సాన్నిహిత్యం అంతంత మాత్రంగానే ఉండేది. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. ఇది కూడా ఆ దేశానికి కీలక వ్యక్తిని రాయబారిగా నియమించడానికి ఓ కారణమైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







