నేడు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు 83వ జయంతి
- April 23, 2017
ఏప్రిల్ 24 న శ్రీ ఏడిద నాగేశ్వరరావు 83 వ జయంతి ... శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం, ఆపత్బాంధవుడు, సితార, సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 83 వ జయంతి ఏప్రిల్ 24 న. ఈ సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం. కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున, ఆయన దృష్టి నటన పై పడి, ఆయన మిత్రుడు శ్రీ వీ.బీ .రాజేంద్రప్రసాద్ గారి ఆహ్వానం తో మద్రాస్ రైలు ఎక్కేసారు. తీరా అక్కడ నిరాశే మిగిలింది. చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ, నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు. అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు. ఆ విజయం ఇఛ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా 'తాయారమ్మ బంగారయ్య' చిత్రాన్ని నిర్మించారు. అది మంచి విజయం సాధించింది. పలు ఇతర భాషల్లోకి రీమేక్ చెయ్యబడింది. తదుపరి చిత్రం కళా తపస్వి కె. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో 'శంకరాభరణం'. తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లినఅద్భుత కావ్యం. ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు, బాక్సాఫీస్ కలెక్షన్స్ గాని, జాతీయ-అంతర్జాతీయ, రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే.. అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం. అలాగే ఏ దేశమెళ్లినా 'శంకరాభరణం' గురించి ప్రస్తావనే అప్పట్లో. ఆ తర్వాత వచ్చిన 'సీతాకోకచిలుక' అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు 'సీతాకోకచిలుక' చిత్రమే ఇన్స్పిరేషన్. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కె.విశ్వనాధ్ కాంబినేషన్ లో 'సాగర సంగమం'. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం. తెలుగు, తమిళంమరియు మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. తదుపరి చిత్రం మరో క్లాసిక్ చిత్రం 'సితార'. ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసికల్ మూవీ. 'సితార' కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది. ఇక 'స్వాతిముత్యం' - కె.విశ్వనాధ్.. కమలహాసన్, రాధిక ల కలయిక లో వచ్చిన ఆణిముత్యం. 1986 లో విడులయ్యిన ఈ చిత్రం, అప్పటికి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది. జాతీయ అవార్డు, రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం. ఇక 'స్వయంకృషి' - మెగాస్టార్ చిరంజీవి తో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా, ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే. అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద. మంచి విజయం సాధించిన ఈ చిత్రం , చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది. ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరో గా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు. మళ్ళీ కె.విశ్వనాధ్ - చిరంజీవి లతో తీసిన చిత్రం, ఆపద్భాంధవుడు. చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ. రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది. ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి, మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదు అంటే సినీ అభిమానులకు చాలా నిరాశే. పద్మ అవార్డుల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్నివిధాలా అర్హులే. కానీ సినీ రాజకీయాల వల్ల, కొందరు సినీ పెద్దల ఏక పక్ష నిర్ణయాల వల్ల, శ్రీ ఏడిదకు దక్క వలసిన గుర్తింపు దక్కలేదు. కనీసం కీర్తిశేషులైన తర్వాత ఇచ్ఛే అవకాశం ఉన్న బిరుధులు, ఇప్పటి తెలుగు ప్రభుత్వాలు ఆయనకీ బహుకరిస్తే బాగుంటుంది అని సినీ అభిమానుల కోరిక.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









