గడవు తీరిన మందుల పట్టివేత
- April 25, 2017
మస్కట్: 91,551 గడవు తీరిన మెడికల్ సప్లైస్ మరియు ఎక్విప్మెంట్ని తనిఖీల్లో పట్టుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించింది. సీబ్ పరిధిలోని ఓ కంపెనీ పరిసరాల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. పిఎసిపి వెల్లడించిన వివరాల ప్రకారం సదరు కంపెనీ, హాస్పిటల్స్ మరియు హెల్త్ కేర్ సెంటర్లకు మందులు, అవసరమైన పరికరాల్ని సరఫరా చేస్తుంటుంది. అయితే, గడువు తీరిన మందుల్ని, అలాగే నాణ్యత లేని పరికరాల్ని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు ఆర్ఓపి సంయుక్తంగా ఈ తనిఖీలను నిర్వహించాయి. ఎక్సపైరీ డేట్స్ని టాంపరింగ్ చేస్తున్న ఆసియాకి చెందిన కార్మికుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్కామ్ నోటిఫికేషన్..
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!







