డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- July 17, 2026
దుబాయ్: డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ వెలువడిన వార్తలను దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం (GDMO) ఖండించింది. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ రియూటర్స్ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డౌన్టౌన్ దుబాయ్ ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
దీనిపై స్పందించిన దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం, డౌన్టౌన్ దుబాయ్లో ఎలాంటి పేలుళ్ల ఘటన జరగలేదని, రాయిటర్స్ ప్రచురించిన సమాచారం వాస్తవాలకు విరుద్ధమని వెల్లడించింది.
ప్రజలు, మీడియా సంస్థలు అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని, ధృవీకరణ లేని వార్తలు, పుకార్లను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జీడీఎంఓ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







