డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక వైద్య విధానాలు
- October 03, 2015
డ్రగ్స్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా కొత్త నిబంధనల్ని రూపొందించారు. ఇప్పటికే పలు ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్ బాధితులకు చికిత్స అందిస్తున్నా, వాటిల్లో చాలావరకు లైసెన్స్ లేనివే. సమస్య తీవ్రతను తెలుసుకున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా డ్రగ్స్ బాధితులకు సాంత్వన చేకూర్చేలా ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామని వెల్లడించింది. 2013 నాటికి సుల్తానేట్లో డ్రగ్స్ బాధితుల సంఖ్య 4079గా ఉంది. 2015లో ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరుకోవడంతో యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ బాధితులకు సేవలందించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు నేషనల్ కమిషన్ ఆన్ డగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఎఫైర్స్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ జహెర్ అల్ అబ్రి వివరించారు. డ్రగ్స్పై నిషేధం ఇంకా కఠినంగా అమలు చేయడం, బాధితులు డ్రగ్స్ వైపు వెళ్ళకుండా చేయడం వంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ మిషన్ ద్వారా చేపట్టనున్నారట.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







