డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక వైద్య విధానాలు
- October 03, 2015
డ్రగ్స్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా కొత్త నిబంధనల్ని రూపొందించారు. ఇప్పటికే పలు ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్ బాధితులకు చికిత్స అందిస్తున్నా, వాటిల్లో చాలావరకు లైసెన్స్ లేనివే. సమస్య తీవ్రతను తెలుసుకున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా డ్రగ్స్ బాధితులకు సాంత్వన చేకూర్చేలా ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామని వెల్లడించింది. 2013 నాటికి సుల్తానేట్లో డ్రగ్స్ బాధితుల సంఖ్య 4079గా ఉంది. 2015లో ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరుకోవడంతో యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ బాధితులకు సేవలందించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు నేషనల్ కమిషన్ ఆన్ డగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఎఫైర్స్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ జహెర్ అల్ అబ్రి వివరించారు. డ్రగ్స్పై నిషేధం ఇంకా కఠినంగా అమలు చేయడం, బాధితులు డ్రగ్స్ వైపు వెళ్ళకుండా చేయడం వంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ మిషన్ ద్వారా చేపట్టనున్నారట.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









