పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది
- October 03, 2015
వరుసగా గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు ఒక్కసారే రూ.660 పెరిగింది. ఈ ఏడాది మొత్తంలో ఒక్క రోజులో ఇంత ఎక్కువ పెరగడం ఇదే మొదటి సారి. ఈ భారీ పెరుగుదలతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది. అమెరికా భత్యాలు పెంచడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న వార్తలతో బంగారం ఒక్కసారిగా పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.బంగారం ప్రభావం వెండి ధరపైనా పడింది. ఈ ఒక్కరోజే రూ.1200 పెరగడంతో కేజీ వెండి ధర రూ.35,800కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ లోహం ధర సైతం పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









