నేటితరం నటీనటులు పై ఆగ్రహం వ్యక్తం చేసిన రిషి కపూర్
- April 28, 2017
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అంత్యక్రియలకు నేటితరం నటీనటులు హాజరు కాకపోవడంపై సీనియర్ నటుడు రిషికపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత గొప్ప నటుడికి కనీస గౌరవం ఇవ్వకపోవడం సిగ్గుచేటని రిషికపూర్ ఆవేదన చెందారు. వరుస ట్వీట్లతో నేటి తరం స్టార్లపై మండిపడ్డారు.
గతకొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న వినోద్ఖన్నా గురువారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ముంబయిలో ఖన్నా అంత్యక్రియలు జరిగాయి. రిషికపూర్ సహా బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్బచ్చన్, అభిషేక్ బచ్చన్, జాకీష్రాఫ్, రణ్దీప్ హుడా, చుంకీ పాండే తదితరులు ఖన్నా అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. అయితే నేటి తరం నటీనటులెవ్వరూ అక్కడ కన్పించకపోవడంపై రిషికపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఈ జనరేషన్కు చెందిన ఒక్క నటుడు కూడా అంత్యక్రియలకు రాకపోవడం సిగ్గుచేటు. పైగా వినోద్ఖన్నా వారితో కలిసి నటించారు కూడా. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి’ అని రిషికపూర్ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో.. ‘రేపు నేను చనిపోయినప్పుడు కూడా నన్ను భుజాన మోసేందుకు ఎవరూ ఉండరు. దీనికి నేను ప్రిపేర్ అయి ఉండాలి’ అని బాధపడ్డారు. కాగా.. రిషికపూర్ భార్య నీతూకపూర్, కుమారుడు రణ్బీర్ కపూర్ కూడా అంత్యక్రియలకు రాలేదు. దీనిపై కూడా రిషికపూర్ ట్వీట్ చేశారు. ‘నా భార్య, కుమారుడు విదేశాల్లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు.’ అని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









