నేటితరం నటీనటులు పై ఆగ్రహం వ్యక్తం చేసిన రిషి కపూర్
- April 28, 2017
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అంత్యక్రియలకు నేటితరం నటీనటులు హాజరు కాకపోవడంపై సీనియర్ నటుడు రిషికపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత గొప్ప నటుడికి కనీస గౌరవం ఇవ్వకపోవడం సిగ్గుచేటని రిషికపూర్ ఆవేదన చెందారు. వరుస ట్వీట్లతో నేటి తరం స్టార్లపై మండిపడ్డారు.
గతకొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న వినోద్ఖన్నా గురువారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ముంబయిలో ఖన్నా అంత్యక్రియలు జరిగాయి. రిషికపూర్ సహా బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్బచ్చన్, అభిషేక్ బచ్చన్, జాకీష్రాఫ్, రణ్దీప్ హుడా, చుంకీ పాండే తదితరులు ఖన్నా అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. అయితే నేటి తరం నటీనటులెవ్వరూ అక్కడ కన్పించకపోవడంపై రిషికపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఈ జనరేషన్కు చెందిన ఒక్క నటుడు కూడా అంత్యక్రియలకు రాకపోవడం సిగ్గుచేటు. పైగా వినోద్ఖన్నా వారితో కలిసి నటించారు కూడా. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి’ అని రిషికపూర్ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో.. ‘రేపు నేను చనిపోయినప్పుడు కూడా నన్ను భుజాన మోసేందుకు ఎవరూ ఉండరు. దీనికి నేను ప్రిపేర్ అయి ఉండాలి’ అని బాధపడ్డారు. కాగా.. రిషికపూర్ భార్య నీతూకపూర్, కుమారుడు రణ్బీర్ కపూర్ కూడా అంత్యక్రియలకు రాలేదు. దీనిపై కూడా రిషికపూర్ ట్వీట్ చేశారు. ‘నా భార్య, కుమారుడు విదేశాల్లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు.’ అని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







