మాసిడోనియన్ పార్లమెంట్ పై దాడి, 100 మందికి పైగా గాయాలు
- April 28, 2017
మాసిడోనియన్ పార్లమెంట్ భవనంపై నిరనన కారులు జరిపిన దాడిలో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పార్లమెంట్ స్పీకర్గా ఆల్బేనియన్ జాతీయుడు ఎన్నిక కావటం పట్ల తీవ్రంగా అసంతృప్తి చెందిన కొందరు పెద్ద సంఖ్యలో గురువారం సాయంత్రం పార్లమెంట్ భవనంపైకి తరలివచ్చారు. జాతీయ పతాకాలు చేతబూని, జాతీయ గీతం ఆలపించుకుంటూ పోలీసుల కార్డాన్ ఛేదించుకుని భవనం లోపలికి దూసుకెళ్లారు. చేతికందిన కుర్చీలు, బెంచీలను విరిచిపారేశారు. అడ్డువచ్చిన పోలీసులపైకి దూకారు.
ఈ దాడిలో గాయపడిన దాదాపు 102 మందికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. కొందరు పార్లమెంట్ సభ్యులు చిరిగిన దుస్తులు, గాయాలతో ప్రాణభయంతో భవనం వెలుపలికి పరుగెత్తుకుంటూ వచ్చారని భద్రతా విభాగం తెలిపింది. పదిమంది వరకు ఎంపీలు, మీడియా సిబ్బంది గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనను యూరోపియన్ యూనియన్తోపాటు అమెరికా కూడా తీవ్రంగా ఖండించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







