పోలీసుల జోక్యంతో కార్మికులకు జీతాలు

- May 01, 2017 , by Maagulf
పోలీసుల జోక్యంతో కార్మికులకు జీతాలు

సుమారు 250 మంది కార్మికులు, అల్‌ కోజ్‌ ఏరియాలోని అల్‌ ఖైల్‌ గేట్‌ వద్ద సోమవారం దుబాయ్‌కి చెందిన కాంట్రాక్టింగ్‌ కంపెనీ ముందు సమావేశమయ్యారు. కొన్నాళ్ళుగా తమకు జీతాలు చెల్లించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు వీరంతా. దుబాయ్‌ పోలీసులు, అలాగే లేబర్‌ కమిటీ అథారిటీస్‌, అలాగే వర్కర్స్‌ రిప్రెజెంటేటివ్స్‌ హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ కంపెనీ కొత్త ఓనర్‌, తమ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లోనే మొత్తం జీతాల్ని చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామని కొత్త ఓనర్‌ వారికి హామీ ఇచ్చారు. హ్యూమన్‌ రైట్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అల్‌ ముర్‌ మాట్లాడుతూ, వర్కర్స్‌, తమ జీతాల కోసం ఆందోళన చేసినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com