సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ కు ఫాల్కే అవార్డు ప్రదానం
- May 03, 2017
ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జరిగిన 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా విశ్వనాథ్ ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ త్యాగరాజ స్వామి కీర్తనను స్మరించుకున్నారు. తన తల్లిదండ్రులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పెళ్లిచూపులు చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత దిల్ రాజు, డాన్స్ డైరెక్టర్ రాజు సుందరం, ఉత్తమ నటీనటులుగా ఎంపికైన అక్షయ కుమార్, సోనంకపూర్ కూడా అవార్డు తీసుకున్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









