సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ కు ఫాల్కే అవార్డు ప్రదానం
- May 03, 2017
ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జరిగిన 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా విశ్వనాథ్ ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ త్యాగరాజ స్వామి కీర్తనను స్మరించుకున్నారు. తన తల్లిదండ్రులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పెళ్లిచూపులు చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత దిల్ రాజు, డాన్స్ డైరెక్టర్ రాజు సుందరం, ఉత్తమ నటీనటులుగా ఎంపికైన అక్షయ కుమార్, సోనంకపూర్ కూడా అవార్డు తీసుకున్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









