సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ కు ఫాల్కే అవార్డు ప్రదానం
- May 03, 2017
ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జరిగిన 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా విశ్వనాథ్ ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ త్యాగరాజ స్వామి కీర్తనను స్మరించుకున్నారు. తన తల్లిదండ్రులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పెళ్లిచూపులు చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత దిల్ రాజు, డాన్స్ డైరెక్టర్ రాజు సుందరం, ఉత్తమ నటీనటులుగా ఎంపికైన అక్షయ కుమార్, సోనంకపూర్ కూడా అవార్డు తీసుకున్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







