పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసు రద్దు
- May 05, 2017
ముంబై, కరాచీల మధ్య నడిచే విమాన సర్వీసులను ఈ నెల 15 నుంచి రద్దు చేయాలని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ నిర్ణయించింది. కొన్ని నెలలుగా భారత్, పాక్ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినడంతో ఇరు దేశాలు దాదాపుగా వీసాలు మంజూరు చేయడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రయాణించేవారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో పాక్ ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం భారత్కు చెందిన ఏ విమాన సంస్థ కూడా పాక్కు నేరుగా సర్వీసులు నడపడం లేదు. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ మాత్రం వారానికి మూడుసార్లు కరాచీ నుంచి ముంబైకి విమానాలను నడుపుతోంది. ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించడం, ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో రాకపోకలు తగ్గాయి. దీని ప్రభావం విమాన రంగంపై పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య నేరుగా నడిచే ఒక్క విమాన సర్వీసును కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









