కశ్మీర్లో దారుణం పాక్.. సౌదీ ఛానళ్ల ప్రసారాలు
- May 05, 2017
జమ్మూకశ్మీర్లో పెరిగిపోతున్న ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టడానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్న భద్రతా బలగాలకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. రాష్ట్ర వ్యాప్తంగా భారత ప్రభుత్వం నిషేధించిన పలు పాకిస్థానీ.. సౌదీ అరేబియా టీవీ ఛానెళ్లు ప్రసారమవుతుండడం ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. దాదాపు 50 వరకు సౌదీ.. పాక్ ఛానెళ్లు నేరుగా ప్రసారం అవుతుండటం గమనార్హం. ఈ ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు ప్రసారం అవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఇలా ప్రసారమవుతున్న ఛానళ్లలో వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్నాయక్కు చెందిన పీస్ టీవీ ఛానెల్ కూడా టెలికాస్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు. శ్రీనగర్లో మొత్తం 50వేల ప్రైవేట్ కేబుల్కనెక్షన్లు ఉన్నాయని.. వీటన్నింటిలో పాక్.. సౌదీ టీవీ ఛానెళ్లు ప్రసారమవుతున్నాయని స్థానిక కేబుల్ ఆపరేటర్ వెల్లడించాడు. ఇలా ప్రసారమవుతున్న ఛానళ్లలో ఎక్కువగా ప్రభుత్వం నిషేధించిన ఛానెళ్లే ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఛానెళ్లలో ఉగ్రవాద సంస్థల ఫొటోలు.. వారికి సంబంధించిన వార్తలు ఎక్కువగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్లో సౌదీ.. పాక్ ఛానెళ్లు ప్రసారం కావడం తప్పేమీ కాదని వాటికి అనుమతి ఉందని శ్రీనగర్లోని అతిపెద్ద కేబుల్ నెట్వర్క్ అయిన సెన్(సైట్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్) యాజమాని అమ్జద్ నూర్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!







