పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసు రద్దు
- May 05, 2017
ముంబై, కరాచీల మధ్య నడిచే విమాన సర్వీసులను ఈ నెల 15 నుంచి రద్దు చేయాలని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ నిర్ణయించింది. కొన్ని నెలలుగా భారత్, పాక్ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినడంతో ఇరు దేశాలు దాదాపుగా వీసాలు మంజూరు చేయడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రయాణించేవారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో పాక్ ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం భారత్కు చెందిన ఏ విమాన సంస్థ కూడా పాక్కు నేరుగా సర్వీసులు నడపడం లేదు. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ మాత్రం వారానికి మూడుసార్లు కరాచీ నుంచి ముంబైకి విమానాలను నడుపుతోంది. ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించడం, ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో రాకపోకలు తగ్గాయి. దీని ప్రభావం విమాన రంగంపై పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య నేరుగా నడిచే ఒక్క విమాన సర్వీసును కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







