పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసు రద్దు
- May 05, 2017
ముంబై, కరాచీల మధ్య నడిచే విమాన సర్వీసులను ఈ నెల 15 నుంచి రద్దు చేయాలని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ నిర్ణయించింది. కొన్ని నెలలుగా భారత్, పాక్ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినడంతో ఇరు దేశాలు దాదాపుగా వీసాలు మంజూరు చేయడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రయాణించేవారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో పాక్ ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం భారత్కు చెందిన ఏ విమాన సంస్థ కూడా పాక్కు నేరుగా సర్వీసులు నడపడం లేదు. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ మాత్రం వారానికి మూడుసార్లు కరాచీ నుంచి ముంబైకి విమానాలను నడుపుతోంది. ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించడం, ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో రాకపోకలు తగ్గాయి. దీని ప్రభావం విమాన రంగంపై పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య నేరుగా నడిచే ఒక్క విమాన సర్వీసును కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









