అబూ హమౌర్ సెంట్రల్ మార్కెట్లో ఉల్లంఘనలకు పాల్పడిన100 మంది పట్టివేత
- May 06, 2017
కతర్:అబు హమార్ ప్రాంతంలో ఉన్న కేంద్ర మార్కెట్లో 102 ఉల్లంఘనలకు పాల్పడిన పలువురిని అదుపులోనికి తీసుకొన్నారు.ఆర్ధిక మరియు వాణిజ్య (ఎంఇసి), మున్సిపాలిటీ, పర్యావరణ మంత్రిత్వశాఖ (ఎంఎంఇ) నిర్వహించిన ఉమ్మడి తనిఖీ కార్యక్రమం గురువారం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యల కోసం నిందితులను సమర్థవంతమైన భద్రతా అధికారులకు అప్పగించినట్లు ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎంఇసి),ఒక ప్రకటనలో తెలిపింది.వీరు ఎటువంటి లైసెన్సు లేకుండా అమ్మకం జరపడం మరియు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆయా వీధి విక్రేతలపై ఆకస్మిక తనిఖీలు జరిగాయి.ఈ ఉల్లంఘనలలో మరికొందరు లైసెన్సుల లేకుండా బరువులు మోసే కూలీలుగా అక్రమంగా పని చేస్తున్నారు. లైసెన్సుల లేకుండా వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్నారని తెలిపారు. ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసే సమయంలో కొందరు లైసెన్స్ లేని వీధి విక్రేతలు వాహనాలు, తమ ఆస్తులను విడిచిపెట్టి పారిపోయినవారి అనేక జంతువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









