స్వాతిని మళ్లీమొదటికి తెచ్చిన డైరెక్టర్ మారుతి

- May 06, 2017 , by Maagulf
స్వాతిని మళ్లీమొదటికి తెచ్చిన డైరెక్టర్ మారుతి

త్రిపుర మూవీ ఫ్లాప్ తరువాత టాలీవుడ్ లో గ్యాప్ తీసుకున్న స్వాతి మళ్ళీ ఇప్పుడు లండన్ బాబులతో కలసి హల్చల్ చేయడానికి రెడీ అవుతోంది. తమిళంలో విజయ్ సేతుపతి..గురు ఫేం రితికా సింగ్ కలసి చేసిన ఓ సినిమాని తెలుగులో స్వాతి లీడ్ రోల్ లో డైరెక్టర్ మారుతి తన బ్యానర్ మీద రీమేక్ చేస్తున్నాడు. చిన్నికృష్ణ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రక్షిత్ అనే కొత్త హీరోతో స్వాతి జతకడుతోంది.
ఈ మూవీలో స్వాతి యాంకర్ గా తన ఒరిజనల్ రోల్లో కనిపించబోతోంది. ఓ ఛానెల్ లో కలర్స్ ప్రోగ్రాం యాంకర్ గా స్వాతి కెరీర్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. తెలుగు హీరోయిన్ అయిన స్వాతికి స్వామిరారా..కార్తికేయ లాంటి హిట్స్ వున్నా టాలీవుడ్ లో బిజీ కాలేకపోయింది. మరి ఇప్పుడు మారుతి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీతో అయినా స్వాతి టాలీవుడ్ లో బిజీ అవుతుందో లేదో!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com