డాక్ లోన పశుక్షేత్రంలో గడువు ముగిసిన పాలు విక్రయంపై చర్యలు
- May 07, 2017
పాలు అందరకీ... సంపూర్ణ ఆహారమైతే, కొందరకి...అక్రమార్జనకు పరిపూర్ణ అవకాశం...గడువు ముగిసిన పాలను తాజా పాలుగా విక్రయిస్తున్నారనే సమాచారం అందుకొన్న అధికారులు ఒక పశుక్షేత్రంపై దాడి చేశారు.మకాబాలోని ఆ విక్రయ కేంద్రంపై అధికారులు తక్షణమే న్యాయపరమైన చర్యలు చేపట్టారు ఆ ప్రాంతంలోని పశుక్షేత్ర యజమానులకు గడువు ముగిసిన తేదీలను ప్రచురించిన పాల ప్యాకెట్లు తమ దగ్గరకు వచ్చారని, వాటిని తమకు తాజా పాలుగా అమ్ముతున్నట్లు చూపుతున్నారని కొందరు వినియోగదారులు పిర్యాదు చేయడంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధకులు ఆ పశు క్షేత్రంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ పశుక్షేత్రంలోని ఒక దుకాణంలోగడువు ముగిసిన తేదీతో ఉన్న పలు పాల ప్యాకేజీలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ నిలవ పాల సమాచారంను పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు సంబంధిత అధికారులకు,ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖతో సహా పలువురికి తెలియజేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీచేసిన ఉత్తర్వు ప్రకారం,ఈ పశుక్షేత్రంలోని దుకాణంకు చెందిన అన్నిశాఖలను వెంటనే అధికారులు మూసివేయించారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







