డాక్ లోన పశుక్షేత్రంలో గడువు ముగిసిన పాలు విక్రయంపై చర్యలు
- May 07, 2017
పాలు అందరకీ... సంపూర్ణ ఆహారమైతే, కొందరకి...అక్రమార్జనకు పరిపూర్ణ అవకాశం...గడువు ముగిసిన పాలను తాజా పాలుగా విక్రయిస్తున్నారనే సమాచారం అందుకొన్న అధికారులు ఒక పశుక్షేత్రంపై దాడి చేశారు.మకాబాలోని ఆ విక్రయ కేంద్రంపై అధికారులు తక్షణమే న్యాయపరమైన చర్యలు చేపట్టారు ఆ ప్రాంతంలోని పశుక్షేత్ర యజమానులకు గడువు ముగిసిన తేదీలను ప్రచురించిన పాల ప్యాకెట్లు తమ దగ్గరకు వచ్చారని, వాటిని తమకు తాజా పాలుగా అమ్ముతున్నట్లు చూపుతున్నారని కొందరు వినియోగదారులు పిర్యాదు చేయడంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధకులు ఆ పశు క్షేత్రంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ పశుక్షేత్రంలోని ఒక దుకాణంలోగడువు ముగిసిన తేదీతో ఉన్న పలు పాల ప్యాకేజీలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ నిలవ పాల సమాచారంను పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు సంబంధిత అధికారులకు,ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖతో సహా పలువురికి తెలియజేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీచేసిన ఉత్తర్వు ప్రకారం,ఈ పశుక్షేత్రంలోని దుకాణంకు చెందిన అన్నిశాఖలను వెంటనే అధికారులు మూసివేయించారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









