నవ్యఆంధ్ర రాజధాని శంకుస్థాపనకి హాజరుకానున్న మోదీ

- October 05, 2015 , by Maagulf
నవ్యఆంధ్ర రాజధాని శంకుస్థాపనకి హాజరుకానున్న మోదీ

రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని అంగీకరించారని చెప్పారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రధానికి తెలిపినట్టు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు మనస్ఫూర్తిగా భూములు ఇచ్చారని అన్నారు. భూసమీకరణ కింద 33 ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి కుటుంబానికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతామన్నారు. స్వచ్ఛ భారత్ నివేదికపై పూర్తి వివరాలు ప్రధానికి అందించినట్టు చంద్రబాబు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com