ఓలాతో చేతులు కలిపిన భారతి ఎయిర్టెల్
- May 08, 2017
కస్టమర్లకు పలు రకాల డిజిటల్ సర్వీసులు అందించే నిమిత్తం క్యాబ్ అగ్రిగేటర్ ఓలాతో భారతి ఎయిర్టెల్ జట్టుకట్టింది. ఇందులో భాగంగా ఓలా యాప్తో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఇంటిగ్రేట్ అవుతుంది. ఫలితంగా వినియోగదారులు తమ ఓలా ప్రయాణాలకు సులభంగా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. అదే విఽధంగా ఓలా మనీ (ఓలా మొబైల్ వాలెట్) మై ఎయిర్టెల్ యాప్, ఎయిర్టెల్ వెబ్సైట్తో ఇంటిగ్రేట్ అవుతుంది. దీని వల్ల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మొబైల్/డిటిహెచ్ కనెక్షన్లకు రీచార్జ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఓలా రైడ్ను బుక్ చేసుకోవాలనుకునే వారికి ఎయిర్టెల్ రిటైల్ పాయింట్లు సహకారం అందించనున్నాయి. రెండు సంస్థల కలయిన మూలంగా కస్టమర్లకు మరిన్ని సర్వీసులు అందించే అవకాశం ఏర్పడుతుందని భారతి ఎయిర్టెల్ ఎండి, సిఇఒ (భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!







