ఫోర్జరీ: బ్యాంక్ ఉద్యోగికి మూడేళ్ళ జైలు
- May 09, 2017
కతర్:బ్యాంకు ఉద్యోగికి మూడేళ్ళ జైలు శిక్షను కోర్ట్ ఆఫ్ అప్పీల్ విధించింది. జైలు శిక్ష ముగిశాక అతన్ని డిపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అధికారిక రికార్డుల్ని ఫేక్ చేయడం, ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులకు లోన్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా సహాయం చేయడం వంటి నేరారోపణలు నిరూపించబడ్డాయి. మొత్తం 5 మిలియన్ ఖతారీ రియాల్స్కి పైగా లోన్ కోసం నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. డాక్యుమెంట్లను ఫేక్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా లోన్ మంజూరు చేయడం వంటి అభియోగాలపై ప్రధమ నిందితుడికి కఠిన శిక్ష విధించారు. అంతకు ముందు బ్యాంక్ అధికారికి 8 ఏళ్ళ జైలు శిక్షను, ఈ కుట్రలో పాల్గొన్న మరో ఇద్దరికి రెండేళ్ళ జైలు శిక్షను విధించింది.
తాజా వార్తలు
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!







