శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు: నిషిత్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన
- May 10, 2017
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డు ప్రమాదంలో నిషిత్ మృతి చెందడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో.. తీవ్ర శోకసముద్రంలో మునిగిన నిషిత్ కుటుంబాన్ని బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రావద్దని అన్నారు. ఎదిగొచ్చిన కుమారుడు దూరమైపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. కొడుకును కోల్పోయిన విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కాగా, అంతకుముందు తెలంగాణ మంత్రి హరీశ్ రావు అపోలో ఆసుపత్రికి చేరుకుని.. ఏర్పాట్లను దగ్గరుండి పరామర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. వీరితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులు మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు.
తాజా వార్తలు
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్









