మెగాస్టార్ చిరు చిత్రంతో రాములమ్మ రీ ఎంట్రీ
- May 16, 2017
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఎక్కడా కూడా లోపం జరగకుండా పక్కా సమాచారంతో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ వారు నానా అవస్థలు పడుతున్నారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించనుండగా రామ్ చరణ్ నిర్మించనున్నాడు. 'ఉయ్యాaవాడ' స్వాతంత్ర సమర యోధుడు కాబట్టి ఈ చిత్రంపై పaువురు డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అసభ్యకరంగా తెరకెక్కిస్తే ఊరుకునేది లేదు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే యూనిట్ సభ్యులు ఈ చిత్రం కోసం పక్కా ప్లాన్ను తయారు చేస్తున్నారు.
స్క్రిప్టు పరంగా ఓ వైపు చాలా సీరియస్గా చర్చలు జరుగుతండగా నటీనటుల విషయం కూడా హాట్ టాఫిక్గా మారింది. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఎవరు అనేది ఇంకా అధికారికంగా ఫిక్స్ కాలేదు. అయితే 'ఉయ్యాలవాడ'కు ముగ్గురు భార్యలు ఉండేవారు అని వార్తలు ప్రచారం అయ్యాయి. మరి ఈ చిత్రంలో ముగ్గురిని చూపిస్తారా లేదా బడ్జెట్ ఎక్కువ అవుతుందని తగ్గిస్తారా అనేది ఇంకా తెలియదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంతో రాములమ్మ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుంది అని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. గతంలో చిరు, విజయశాంతిలు కలిసి ఎన్నో చిత్రాలలో జతగా నటించగా ఈ చిత్రం ద్వారనే విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అనేది చిత్ర యూనిట్ అధికారిక ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







