గ్రూప్-1 అధికారిగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు
- May 16, 2017
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధును గ్రూప్-1 అధికారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించనుంది. నియామకంలో ఉన్న ప్రతిబంధకాన్ని తొలగించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ (ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాల నియంత్రణ, సిబ్బంది నమూనా హేతుబద్దీకరణ, వేతన విధానం) సవరణ బిల్లును శాసనసభ మంగళవారం ఆమోదించింది. ఆర్థిక, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఈ బిల్లు.. రైతులకు న్యాయం చేయాలన్న వైకాపా సభ్యుల నినాదాల మధ్యే సభ ఆమోదం పొందింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన పి.వి.సింధును యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. సింధును గ్రూప్-1 అధికారిగా ప్రభుత్వ సర్వీసులోకి తీసుకుని సబ్కలెక్టర్గా క్రీడల బాధ్యత అప్పగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వ్యవస్థాపరమైన అడ్డంకులను అధిగమించేందుకు సవరణ బిల్లును సభలో పెట్టినట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. బిజేపీ పక్ష నేత విష్ణుకుమార్రాజు సవరణ బిల్లుకు మద్దతు ప్రకటించారు.
‘అ’ అంటే...
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందం ముఖ్యమని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అన్నారు. సభలో ఆందోళన చేస్తున్న వైకాపా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ‘అ’ అంటే అమ్మ. ‘ఆ’ అంటే ఆంధ్రప్రదేశ్.
‘అ’ అమరావతి. ‘ఆ’ ఆరోగ్యం, ఆనందంగా అభివర్ణించారు. వస్తు సేవల బిల్లు (జీఎస్టీ)ను కూడా వ్యతిరేకించిన వారిని ఏమనాలి? కొంతమంది తప్పులు చేసి జీవితాంతం బాధపడుతూ వేరే వాళ్లను బాధ పెట్టే ప్రయత్నం చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









